నొప్పి తెలియకుండా నిమిషంలో ప్రాణం తీసే సూసైడ్ మెషిన్..
- December 08, 2021
స్విట్జర్లాండ్: అనారోగ్య కారణాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత మంది కారుణ్య మరణాలకు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటాం. ఐతే దీనిపై మన దేశంలో పెద్దగా అవగాహన లేదు. కానీ కొన్ని దేశాలు అనారోగ్యం బారిన పడి, చావు కోసం ఎదురుచూసే వారి కారుణ్య మరణానికి అనుమతిస్తుంటాయి. అలాంటి వారి కోసమే ఇప్పుడు సూసైడ్ మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ మెషిన్కు స్విట్జర్లాండ్ ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చేసింది. నొప్పి తెలియకుండా నిమిషంలో వ్యవధిలో ప్రాణాలు తీసేస్తుంది ఈ మెషిన్. శవపేటిక ఆకారంలో ఉండే దీన్ని సార్కో అని కూడా పిలుస్తారు. హైపోక్సియా..హైపోకాప్నియా సర్కిల్ సూత్రంపై ఆధారపడి ఈ మెషిల్ పని చేస్తుంది. అటే ఇందులో మనిషి పడుకోగానే....క్రమంగా ఆక్సిజన్ లెవల్స్ తగ్గించి...నైట్రోజన్ను పంపిస్తారు. దీంతో బాధితుడి శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది.
రక్తంలో కార్భన్ డై ఆక్సైడ్ నిల్వలు పెరిగి బాధితుడి మరణానికి కారణమవుతుంది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ మరణం కోసం ఎదురు చూసే వారికి ఇలాంటి యంత్రాలను వాడాలని స్విట్జర్లాండ్ చట్టాలు చెప్తున్నాయి. కారుణ్య మరణం కోరుకునేవారు కోర్టు, ప్రభుత్వం అనుమతితో పాటు డాక్టర్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి తీసుకోవాలి. ఈ మెషిన్ను డాక్టర్ నిట్స్కే తయారు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుంటే వచ్చే ఏడాది నాటికి స్విట్జర్లాండ్లో ఈ మెషిన్ను అందుబాటులోకి తెస్తామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







