ముస్లిమేతర నిర్వాసితుల కుటుంబ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు
- December 15, 2021
అబుధాబి: ముస్లిమేతర నిర్వాసితుల కుటుంబ వివాదాల కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టును అబుధాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD) అండర్ సెక్రటరీ యూసఫ్ సయీద్ అల్ అబ్రి ప్రారంభించారు. అబుధాబి ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ముస్లిమేతర కుటుంబ వ్యవహారాలను నియంత్రించే చట్టాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూసఫ్ సయీద్ అల్ అబ్రి మాట్లాడుతూ.. ఉప ప్రధాని, అధ్యక్ష వ్యవహారాల మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలకు అనుగుణంగా అబుదాబి న్యాయ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగమే కోర్టు ఏర్పాటు అని వివరించారు. కొత్తగా ప్రారంభించిన కోర్టులో ద్విభాషా (అరబిక్, ఇంగ్లీష్)ను అమల్లో ఉంటుందన్నారు. కోర్టు ద్వారా వర్తించే ముస్లిమేతరుల వ్యక్తిగత స్థితి చట్టం, కుటుంబ విషయాల నియంత్రణలో పౌర సూత్రాలను వర్తింపజేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిది అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..