చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ నరవణెకు బాధ్యతలు
- December 16, 2021
న్యూ ఢిల్లీ: చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ M.M. నరవణె బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఈ కమిటీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఛైర్మన్ గా ఉంటారు.
ప్రస్తుత CDS జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణెను కమిటీ ఛైర్మన్ గా నియమించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. CDS పదవిని సృష్టించక ముందు మూడు దళాల అధిపతుల్లో సీనియర్ గా ఉన్న వ్యక్తి ఛైర్మన్ గా వ్యవహరించేవారు. ఆర్మీ, వాయుసేన, నావికా దళాల అధ్యక్షులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌధరి సెప్టెంబర్ 30న వాయుసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించగా. నేవీ చీఫ్ గా అడ్మిరల్ R.హరికుమార్.నవంబర్ 30న పదవిలోకి వచ్చారు. జనరల్ నరవణె మాత్రం.2019 డిసెంబర్ నుంచి ఆర్మీ చీఫ్ గా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!