'సంచారి' పాట విడుదల
- December 16, 2021
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రం నుండి సంచారీ సాంగ్ విడుదలైంది. కొత్త నేలపై గాలి సంతకం.. కొండ గాలితో శ్వాస పంపకం అనే లిరిక్స్తో సాగుతున్న ఈ సాంగ్ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఈ పాటలో ప్రభాస్ లుక్స్ ఆకట్టుకున్నాయి. వింటేజ్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ పాటను అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. కఅష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఈ ప్రేమకథ చిత్రానికి జస్టిన్ ప్రభాకరణ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!