ఒమన్ ప్రభుత్వ ప్రాయోజిత వంటగ్యాస్ సబ్సిడీలపై ఇక కోత
- March 24, 2016
ఒమన్ ప్రభుత్వ ప్రాయోజిత వంటగ్యాస్ సబ్సిడీలపై ఇక కోత విధించే విషయమై యోచిస్తోంది. ఒమన్ ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్ పి జీ ) రాయితీలకల తగ్గించాలని ఆలోచిస్తున్నట్లు, ఇంధన మరియు సహజ వాయువు మంత్రిత్వశాఖ సహాయ కార్యదర్శీ సేలం బిన్ నాసర్ అల్ ఔఫీ బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం త్వరలో వంటగ్యాస్ కోసం రాష్ట్ర రాయితీలు కత్తిరించనున్నట్లు తెలిపారు. వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలకు రాష్ట్ర సబ్సిడీలపై కోత విషయం పై గత ఐదు సంవత్సరాలుగా ఇవ్వాలా వద్దా అనే విషయంపై చర్చ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉందన్నారు.అయితే వారికి ఒక మార్కెట్ ధరను ఏర్పాటు చేయాలని ఒమాన్ ప్రభుత్వం పెర్కొంతున్నప్పటకీ, అది కార్యాచరణ దాల్చడం లేదని అల్ ఔఫీ పేర్కొన్నారు. ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్ పి జీ ) రాయితీలను సుల్తానేట్ ప్రాంతంలో కత్తిరించడం వలన సిమెంట్, ఉక్కు మరియు పింగాణీ పలకలను తయారు చేసే పలు పరిశ్రమలు, పారిశ్రామిక యూనిట్ల ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వివరాల ప్రకారం ఒమన్ ప్రభుత్వం గత సంవత్సరం 7.3 బిలియన్లను అమెరికా డాలర్లను ఇంధన రాయతీలను అందించింది
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







