ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ పిఎ ఇబ్రహీం హాజి మృతి
- December 21, 2021
దుబాయ్లో ప్రముఖ వ్యాపారవేత్తగా ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నడాక్టర్ పిఎ ఇబ్రహీం మాజి తుది శ్వాస విడిచారు. యూఏఈలో 55 ఏళ్ళపాటు వున్నారాయన. అనారోగ్య కారణాలతో కోజికోడ్లోని మిమ్స్ ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.డిసెంబర్ 20న ఆయన్ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇండియాకి తరలించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో వైద్య చికిత్స నిమిత్తం ఆయన్ను తరలించడం జరిగింది. కేరళలో జన్మించిన డాక్టర్ హాజి, మలబార్ గ్రూప్ కో-ఛైర్మన్ అలాగే పేస్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఛైర్మన్గా పని చేశారు. ఇండస్ మోటార్ కంపెనీ వైస్ ఛైర్మన్ అలాగే వ్యవస్థాపకుడాయన. మలబార్ గోల్డ్ సంస్థ కో-ఛైర్మన్ మరియు ముఖ్యమైన పెట్టుబడిదారుగా వున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!