ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ పిఎ ఇబ్రహీం హాజి మృతి

- December 21, 2021 , by Maagulf
ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ పిఎ ఇబ్రహీం హాజి మృతి

దుబాయ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నడాక్టర్ పిఎ ఇబ్రహీం మాజి తుది శ్వాస విడిచారు. యూఏఈలో 55 ఏళ్ళపాటు వున్నారాయన. అనారోగ్య కారణాలతో కోజికోడ్‌లోని మిమ్స్ ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.డిసెంబర్ 20న ఆయన్ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇండియాకి తరలించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో వైద్య చికిత్స నిమిత్తం ఆయన్ను తరలించడం జరిగింది. కేరళలో జన్మించిన డాక్టర్ హాజి, మలబార్ గ్రూప్ కో-ఛైర్మన్ అలాగే పేస్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఛైర్మన్‌గా పని చేశారు. ఇండస్ మోటార్ కంపెనీ వైస్ ఛైర్మన్ అలాగే వ్యవస్థాపకుడాయన. మలబార్ గోల్డ్ సంస్థ కో-ఛైర్మన్ మరియు ముఖ్యమైన పెట్టుబడిదారుగా వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com