కువైట్ వెళ్లేవారికి కొత్త ఆంక్షలు..
- December 23, 2021
కువైట్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో కువైట్ తాజాగా అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త ఆంక్షలు విధించింది.శరవేగంగా ప్రబలుతున్న కొత్త వేరియంట్ను కట్టడిచేసేందుకు ఆ దేశ ఆరోగ్యశాఖ విదేశీ ప్రయాణికులకు కొత్త ఆంక్షలు తీసుకోచ్చింది. ఇప్పటికే తొమ్మిది ఆఫ్రికన్ దేశాలపై నిషేధం విధించిన కువైట్ తాజాగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.పీసీఆర్ టెస్టు, 10 రోజుల హోం క్వారంటైన్ తదితర కొత్త ఆంక్షలు విధించింది.ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేసింది.
కువైట్ ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం...
- ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కువైట్ చేరుకోవడానికి 48 గంటల ముందే పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి.అలాగే ఆ దేశానికి వెళ్లిన తర్వాత 10 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండడం తప్పనిసరి.ఈ ఆంక్షలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయి.
- అలాగే క్వారంటైన్ పీరియడ్ ముగిసిన 72 గంటల తర్వాత తప్పకుండా మరోసారి పీసీఆర్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది.
- ఇక 2022 జనవరి 2 నుంచి కువైట్లో మరో కొత్త రూల్ అమలు కానుంది. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుని 9 నెలలు గడిచిన తర్వాత నుంచి బూస్టర్ డోసు తీసుకోవడం తప్పనిసరి. అలాంటి వారికే ప్రయాణాలు చేయడానికి అనుమతి ఉంటుంది. లేనిపక్షంలో అసలు వ్యాక్సిన్ తీసుకోని వారిగా పరిగణించడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. --దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







