కువైట్ వెళ్లేవారికి కొత్త ఆంక్షలు..
- December 23, 2021
కువైట్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో కువైట్ తాజాగా అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త ఆంక్షలు విధించింది.శరవేగంగా ప్రబలుతున్న కొత్త వేరియంట్ను కట్టడిచేసేందుకు ఆ దేశ ఆరోగ్యశాఖ విదేశీ ప్రయాణికులకు కొత్త ఆంక్షలు తీసుకోచ్చింది. ఇప్పటికే తొమ్మిది ఆఫ్రికన్ దేశాలపై నిషేధం విధించిన కువైట్ తాజాగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.పీసీఆర్ టెస్టు, 10 రోజుల హోం క్వారంటైన్ తదితర కొత్త ఆంక్షలు విధించింది.ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేసింది.
కువైట్ ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం...
- ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కువైట్ చేరుకోవడానికి 48 గంటల ముందే పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి.అలాగే ఆ దేశానికి వెళ్లిన తర్వాత 10 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండడం తప్పనిసరి.ఈ ఆంక్షలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయి.
- అలాగే క్వారంటైన్ పీరియడ్ ముగిసిన 72 గంటల తర్వాత తప్పకుండా మరోసారి పీసీఆర్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది.
- ఇక 2022 జనవరి 2 నుంచి కువైట్లో మరో కొత్త రూల్ అమలు కానుంది. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుని 9 నెలలు గడిచిన తర్వాత నుంచి బూస్టర్ డోసు తీసుకోవడం తప్పనిసరి. అలాంటి వారికే ప్రయాణాలు చేయడానికి అనుమతి ఉంటుంది. లేనిపక్షంలో అసలు వ్యాక్సిన్ తీసుకోని వారిగా పరిగణించడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. --దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..