రోజు మెట్లు ఎక్కితే ఆరోగ్యానికి మంచిది!
- March 24, 2016
ప్రతిరోజూ కొంతసేపు మెట్లు ఎక్కడం ద్వారా మెదడు వయసు తగ్గడమే కాకుండా, ఎంతో చురుగ్గా మారుతుందని తాజాగా జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. మెట్లు ఎక్కడం ద్వారా కొవ్వు తగ్గి శరీరం తేలిగ్గా ఉండడమే గాక మెదడు వయస్సు తగ్గుతుందని పరిశోధన తెలిపింది. కెనడాలోని కంకార్డియా విశ్వవిద్యాలయానికి చెందిన జాసన్ స్టెఫెనర్ బృందం చేపట్టిన ఈ పరిశోధనపై 'న్యూరో బయోలజీ ఆఫ్ ఏజింగ్' పత్రిక ఇటీవల వ్యాసం ప్రచురించింది. పరిశోధనలో భాగంగా 19-79 సంవత్సరాల మధ్య వయసున్న 331 మంది ఆరోగ్యవంతులతో మెట్లు ఎక్కించారు. కళాశాలలకు పంపారు. వీరి మెదళ్లలో న్యూరాన్లకు నిలయమైన గ్రేమ్యాటర్ పరిమాణాలను గమనించారు. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ మెదడు న్యూరాన్లను కోల్పోయి, గ్రేమ్యాటర్ పరిమాణంలో మార్పులు వస్తుంటాయి.
ఆ ప్రకారం ఒక ఏడాది చదువుకోవడం వల్ల మెదడు వయసు 0.95 సంవత్సరం, రోజూ రెండు అంతస్తుల మెట్లు ఎక్కడం వల్ల 0.58 సంవత్సరం చొప్పున తగ్గుతున్నట్లు జాసన్ లెక్కగట్టారు. వృద్ధులు, వృద్ధాప్యానికి చేరువలో ఉన్నవారు నిత్యం వీలైనన్ని మెట్లు ఎక్కడం వల్ల మెదడును చురుగ్గా ఉంచుకోవచ్చని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం









