మహజూజ్ రాఫెల్ డ్రాలో భారత కార్మికుడికి జాక్పాట్..
- December 31, 2021
దుబాయ్: మహజూజ్ రాఫెల్ డ్రాలో ఫుజైరాలో ఉండే భారత కార్మికుడికి జాక్పాట్ తగిలింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. తాజాగా నిర్వహించిన 57వ వీక్లీ డ్రాలో తినాకర్(25) అనే భారత ప్రవాసుడికి ఈ జాక్పాట్ తగిలింది. ఈ రాఫెల్లో పాల్గొన్న తొలిసారినే ఆయనకు అదృష్టం వరించడం విశేషం. ఇంకేముంది తినాకర్ ఖాతాలో రాత్రికి రాత్రే 10 మిలియన్ దిర్హమ్స్ వచ్చాయి. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు.
"చాలా రోజులుగా నా రూమ్మెట్స్ ఈ రాఫెల్లో పాల్గొంటున్నారు. దాంతో నాకు కూడా ఒకసారి ప్రయత్నిద్దామని అనిపించింది. వెంటనే 1, 33, 40, 45, 46 నంబర్తో టికెట్ కొన్నాను. మొదటిసారి కాబట్టి పెద్దగా నంబర్ల గురించి పట్టించుకోలేదు. ఏదో తోచిన నంబర్లను ఎంచుకున్నాను. అదే నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. వీక్లీ డ్రాలో నేను కొనుగోలు చేసిన నా ఐదు నంబర్లు మ్యాచ్ అయ్యాయి. దాంతో 10 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాను. ఇదంతా స్వర్గస్థులైన మా తాత-నాన్నమ్మల బ్లెస్సింగ్స్. వ్యవసాయ కూలీలుగా బతికే మా ఫ్యామిలీకి ఈ భారీ మొత్తం ఎంతో ఉపయోగకరం." అని తినాకర్ చెప్పుకొచ్చాడు. రెండేళ్ల క్రితం స్నేహితుల వద్ద అప్పు చేసి ఉపాధి కోసం యూఏఈ వచ్చినట్లు తెలిపాడు. రాఫెల్లో పాల్గొన్నప్పుడు ఇంత భారీ మొత్తం గెలుస్తానని కలలో కూడా అనుకోలేదని, నిజంగా మా కుటుంబం కష్టాలను చూసి దేవుడే కరుణించాడని తినాకర్ ఆనందం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ







