‘ఆచార్య’ మూడో పాటకు ముహుర్తం ఖరారు
- December 31, 2021
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 3 వ తేదీన ‘సాన కష్టం’ అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హై వోల్టేజ్ పార్టీ సాంగ్ అని హింట్ ఇస్తూ చిరు పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఇక ఈ సాంగ్ లో చిరు మాస్ స్టెప్స్ తో అలరించనున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఫిబ్రవరి 4 న రిలీజ్ అవుటున్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మెగా కాంబో ఎంతటి విజయాన్ని రాబట్టుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







