‘ఆచార్య’ మూడో పాటకు ముహుర్తం ఖరారు
- December 31, 2021
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 3 వ తేదీన ‘సాన కష్టం’ అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హై వోల్టేజ్ పార్టీ సాంగ్ అని హింట్ ఇస్తూ చిరు పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఇక ఈ సాంగ్ లో చిరు మాస్ స్టెప్స్ తో అలరించనున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఫిబ్రవరి 4 న రిలీజ్ అవుటున్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మెగా కాంబో ఎంతటి విజయాన్ని రాబట్టుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







