భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
- January 03, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు తీవ్రస్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.తాజాగా భారత్లో 33,750 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నారని, నిన్న ఒక్కరోజులో 10,846 మంది కోలుకున్నట్టు బులిటెన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 123 మంది మృతి చెందారు. దీంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,81,893 కి చేరింది.
కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం రోజున 27 వేలకు పైగా కేసులు నమోదవ్వగా, సోమవారం రోజున ఆ సంఖ్య 33 వేలకు చేరుకుంది.సుమారు 6 వేలకు పైగా కేసులు అదనంగా ఒక్కరోజులో పెరిగాయి.అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పార్కులు, జిమ్లు వంటి వాటిని మూసివేశారు.కార్యాలయాలు 50 శాతంతో పనిచేస్తున్నాయి.కేసులు ఇలానే పెరిగితే మరిన్ని ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









