ఏపీలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు..
- January 03, 2022
తెలంగాణలో రాజన్నరాజ్యం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్ షర్మిల.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఆమె ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెట్టబోతున్నారా? అనే చర్చకు తెరలేపాయి.. ఏపీలో పార్టీ పెడుతున్నారా? అంటూ మీడియా చిట్చాట్లో ఎదురైన ప్రశ్నకు స్పందించిన ఆమె.. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు.. ఆంధ్రప్రదేశ్లో పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అంటూ వ్యాఖ్యానించి సంచలనానికి తెరలేపారు.. మేం ఒక మార్గాన్ని ఎంచుకున్నాం.. పరిస్థితులను బట్టి ముందుకు వెళ్తాం అన్నారు.. ఇక, ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు వైఎస్ షర్మిల.. రైతు ఆవేదన యాత్ర పేరుతో మరోసారి పాదయాత్రకు పూనుకుంటున్నారు.. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. పాదయాత్రకు అనుమతి లేదంటున్నారు పోలీసులు.. అయితే, నిబంధనల ప్రకారం తాము వెళ్తామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదని షర్మిల మండిపడ్డారు.
మరోవైపు.. రైతు బంధు పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డురావు అంటూ తెలంగాణ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైఎస్ షర్మిల... ప్రతిపక్షాల గొంతు నొక్కెందుకే నిబంధనలు అడ్డువస్తాయన్న ఆమె.. బీజేపీ, కేసీఆర్ దొందు దొందే అంటూ మండిపడ్డారు.. ఇష్యూ డైవర్ట్ చేసేందుకు బీజేపీని ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా చెబుతూ.. ముందుకు సాగుతోన్న సంగతి తెలిసిందే. కానీ, ఏపీలో రాజకీయ పార్టీ పెట్టకూడదనే రూల్ ఏం లేదు కదా? అంటూ ఆమె ఇప్పుడు చేసిన వ్యాఖ్యల్లో ఆంధ్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారుతున్నాయి. తెలంగాణలో పెట్టిన పార్టీకే సరైన స్పందన లేదు.. ఇక, ఆంధ్రలో పార్టీ పెడతారా? అంటూ కామెంట్లు చేసేవారు లేకపోలేదు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







