50 ఏళ్ళ పైబడినవారికి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా బూస్టర్ డోసులు
- January 03, 2022
కువైట్ సిటీ: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం 50 ఏళ్ళు పైబడినవారు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే బూస్టర్ డోస్ పొందవచ్చు. సోమవారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే, అలాంటివారంతా ఇప్పటికే రెండు డోసులు తీసుకుని వుండాలి. 50 ఏళ్ళ లోపువారైతే, ముందస్తుగా అపాయింట్మెంట్ బూస్టర్ డోసు కోసం తీసుకోవాలి. జబెర్ బ్రిడ్జి, మిష్రెఫ్ మరియు జిలీబ్ అల్ షుయోక్ యూత్ సెంటర్ అలాగే దేశవ్యాప్తంగా పబ్లిక్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ అందుబాటులో వుంది. గత వారం 115,024 మంది బూస్టర్ డోసుని తీసుకోగా, ఇప్పటిదాకా మొత్తంగా బూస్టర్ డోసులు తీసుకున్నవారి సంఖ్య 461,693కి చేరుకుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









