అవినీతి ఆరోపణలపై 233 మంది ప్రభుత్వ సిబ్బంది అరెస్ట్

- January 05, 2022 , by Maagulf
అవినీతి ఆరోపణలపై 233 మంది ప్రభుత్వ సిబ్బంది అరెస్ట్

సౌదీ: లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలపై సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) మొత్తం 233 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను అరెస్టు చేసింది. గత నెలలో నజాహా మొత్తం 5518 తనిఖీ చేపట్టింది. తనిఖీల్లో 641 మంది అనుమానితులపై అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. వారిలో 233 మందిని అరెస్టు చేసినట్లు నజాహా మంగళవారం తెలిపింది. అరెస్టయిన వారిలో రక్షణ, అంతర్గత, జాతీయ గార్డు, ఆరోగ్యం, న్యాయం, మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహ మంత్రిత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com