ఓమిక్రాన్ మరో లక్షణం...కాళ్లలో తీవ్రమైన నొప్పి
- January 11, 2022బెంగళూరు: ప్రపంచం అంతటా ఓమిక్రాన్ చుట్టేస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఓమిక్రాన్ లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటున్నాయి.
తాజాగా బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మరో వైద్యుడు లక్షణాల్లో మార్పును ధృవీకరించారు. "ఒక వ్యక్తికి పాజిటివ్ పరీక్షలు వచ్చినప్పుడు అలసటతో పాటు జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది సాధారణంగా ప్రాథమిక లక్షణాలుగా పరిగణిస్తాం. అయితే, ఈమధ్యన ఓమిక్రాన్ వచ్చిన పీజీ మెడికల్ విద్యార్థిని భూమిక పవార్, తనకు కాలునొప్పి ఎక్కువైందని తెలియజేయటం జరిగింది”అని డాక్టర్ బాను చెప్పారు.
"ఇది తొడ నుండి కాలి వరకు వ్యాపించింది. మొదట్లో అది ఎడమ కాలులో అనిపించినా తర్వాత రెండు కాళ్లు కూడా నొప్పి గా ఉన్నట్టు పవార్ చెప్పారు.
మరో వ్యక్తి మాటల్లో.. జనవరి 3న రాజాజీనగర్లోని స్నేహితుడి స్థలంలో న్యూ ఇయర్ పార్టీ హాజరైన తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన చంద్రకాంత్ గౌడ ఇలా అన్నాడు: “గొంతు దురద కారణంగా నేను మింగలేకపోయాను. నాకు జ్వరం, జలుబు లేదు. మూడవ రోజు, నాకు కాలు నొప్పి వచ్చింది, ఇది నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించనిది, కానీ అది ఒక రోజులో తగ్గింది”అని గౌడ చెప్పారు.
గొంతు నొప్పితో బాధపడేవారు బెటాడిన్తో పుక్కిలించాలని మరియు కాలు నొప్పికి పారాసెటమాల్ (డోలో-650) తీసుకోవాలని డాక్టర్ బాను సూచించారు. లక్షణాలు మరింత తీవ్రమైతే, ఆసుపత్రిలో చేరడం మంచిది అని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం