కొత్త పార్కింగ్ పర్మిట్ సర్వీసుని ప్రకటించిన యూఏఈ
- January 11, 2022
యూఏఈ: యూఏఈ డిపార్టుమెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ మరియు ట్రాన్స్పోర్ట్, రెసిడెంట్ పార్కింగ్ పర్మిట్ సర్వీసు యాప్ విషయమై ప్రకటన చేసింది. కొత్త విధానం ద్వారా వినియోగదారులు కొత్త రెసిడెంట్ పార్కింగ్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం, గడువు తతీరిన పర్మిట్లను రెన్యువల్ చేసుకోవడం వంటివాటి కోసం కొత్తగా ఎలాంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన పని వుండదు. వాహన సమాచారం లేదా రెసిడెన్స్ సమాచారాన్ని మార్చేందుకూ అవకాశం ఈ కొత్త విధానం ద్వారా లభిస్తుంది. ‘దర్బ్’ వెబ్సైట్ లేదా దర్బ్ అప్లికేషన్ ద్వారా ఈ సేవలు అందుబాటులో వుంటాయి. సర్వీసు ఫీజు అలాగే మవాకిఫ్ జరీమానాలు చెల్లించేందుకు కూడా మరింత వీలు కల్పించారు. సర్వీసు ఫీజుల్ని అలాగే జరీమానాల్ని ఒకే వేదికపై చెల్లించడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









