ఏపీ కరోనా అప్డేట్
- January 13, 2022
అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.24 గంటల్లో 47,884 శాంపిల్స్ను పరీక్షించగా 4,348 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,92,227 కి చేరింది.ఇందులో 20,63,516 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,204 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 14,507 మంది మృతి చెందినట్టు హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు.24 గంటల్లో 261 మంది కోలుకున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో అనంతపూర్లో 230 కేసులు, చిత్తూరులో 932, తూర్పు గోదావరిలో 247, గుంటూరులో 338, కడపలో 174, కృష్ణాలో 296, కర్నూలులో 171, నెల్లూరులో 395, ప్రకాశంలో 107, శ్రీకాకుళంలో 259, విశాఖపట్నంలో 823, విజయనగరంలో 290, పశ్చిమ గోదావరిలో 86 కేసులు నమోదయ్యాయి.కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈనెల 18 వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూను అమలులోకి తెస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!