రెండు ఉమ్రాల మధ్య 10 రోజుల విరామం తప్పనిసరి
- January 17, 2022
సౌదీ అరేబియా: విదేశీ యాత్రికులతో సహా అన్ని వయసుల యాత్రికులకు రెండు ఉమ్రా పర్మిట్ల జారీకి మధ్య 10 రోజుల విరామాన్ని తప్పనిసరి చేస్తూ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ యాత్రికులు తమ 30 రోజుల పర్మిట్ లో గరిష్టంగా మూడు ఉమ్రాలను చేయవచ్చు. పర్మిట్ పొందిన యాత్రికుడు, మొదటి ఉమ్రా తర్వాత 10 రోజుల గ్యాప్ లో ఈట్మార్నా లేదా తవక్కల్నా యాప్ ద్వారా రెండవ ఉమ్రా కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే తవక్కల్నాలో రోగనిరోధక ఆరోగ్య స్థితి కేటగిరీ లో ఉన్న 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న యాత్రికులందరూ గ్రాండ్ మసీదులో ఉమ్రా, ప్రార్థన చేయడానికి అనుమతించబడతారు. COVID-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు, నివారణ ప్రోటోకాల్ లో భాగంగా 10 రోజుల పరిమితిని విధించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు









