రెండు ఉమ్రాల మధ్య 10 రోజుల విరామం తప్పనిసరి
- January 17, 2022
సౌదీ అరేబియా: విదేశీ యాత్రికులతో సహా అన్ని వయసుల యాత్రికులకు రెండు ఉమ్రా పర్మిట్ల జారీకి మధ్య 10 రోజుల విరామాన్ని తప్పనిసరి చేస్తూ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ యాత్రికులు తమ 30 రోజుల పర్మిట్ లో గరిష్టంగా మూడు ఉమ్రాలను చేయవచ్చు. పర్మిట్ పొందిన యాత్రికుడు, మొదటి ఉమ్రా తర్వాత 10 రోజుల గ్యాప్ లో ఈట్మార్నా లేదా తవక్కల్నా యాప్ ద్వారా రెండవ ఉమ్రా కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే తవక్కల్నాలో రోగనిరోధక ఆరోగ్య స్థితి కేటగిరీ లో ఉన్న 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న యాత్రికులందరూ గ్రాండ్ మసీదులో ఉమ్రా, ప్రార్థన చేయడానికి అనుమతించబడతారు. COVID-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు, నివారణ ప్రోటోకాల్ లో భాగంగా 10 రోజుల పరిమితిని విధించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి