భారత్ కరోనా అప్డేట్
- January 17, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.ఆదివారం నమోదైన కేసుల కంటే సోమవారం రోజున 5 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి.ఇదే సమయంలో పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు.దేశంలో ప్రస్తుతం 16,56,341 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.కరోనా కేసుల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టినా పాజిటివిటీ రేటు 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 8209 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.సుమారు 157 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించినట్టు బులిటెన్లో పేర్కొన్నారు.భారత్లోని 29 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు.రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి