సౌకర్యాలు లేని 49 ఇంధన కేంద్రాలపై కేసులు
- January 17, 2022
మస్కట్: ఇంధన కేంద్రాల్లో నిర్దేశించబడిన సౌకర్యాలను తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MOCIIP) స్పష్టం చేసింది. వివిధ గవర్నరేట్లలోని 334 ఇంధన కేంద్రాలను తనిఖీ చేసింది. తనిఖీ సమయంలో నిబంధనల ప్రకారం లేని 49 బంకులపై కేసులు నమోదు చేసింది. టైర్లకు గాలి నింపే యంత్రాలను అందించడంలో వైఫల్యం, టాయిలెట్ల శుభ్రత పాటించకపోవడం, కొన్ని స్టేషన్లలో షాపింగ్ దుకాణాలు లేకపోవడం లాంటి ఉల్లంఘనలు ఇందులో ఉన్నాయి. ప్రతి ఇంధన స్టేషన్లలో ఈ క్రింది సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని తెలిపింది.
పురుషులు, మహిళలు ఇద్దరికీ వేర్వేరు మస్జిద్ లు
మరుగుదొడ్లు
రెస్టారెంట్ లేదా కేఫ్తో కూడిన వాణిజ్య భవనం
సౌకర్యవంతమైన దుకాణాలు
ఫార్మసీ
ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM)
కార్ వాష్
సమాచార కేంద్రం
ప్రాథమిక మెకానికల్ సేవ
కార్లు, ట్రక్కుల కోసం పార్కింగ్
వికలాంగులకు పార్కింగ్ స్థలాలు విశ్రాంతి గృహాలు, హోటళ్ళు
తాజా వార్తలు
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!
- సోహార్ టైర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆఫ్రికాకు చెందిన మహిళలు అరెస్ట్..!!
- ఖతార్ మధ్యవర్తిత్వానికి మద్దతు ఇస్తుంది.. అన్నింటికి ఖతార్ సిద్ధం..!!
- యూఏఈ పర్యటనలో మరణించిన భారతీయురాలు..30 రోజుల తర్వాత స్వదేశానికి డెడ్ బాడీ తరలింపు..!!









