ఖతార్లో కోవిడ్-19 బారిన పడి 3 వారాల పాప మృతి
- January 17, 2022
ఖతార్: తీవ్రమైన కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ కారణంగా ఖతార్లో మూడు వారాల పాప ఆదివారం మరణించిందని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ట్వీట్లో వెల్లడించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. తాజా వేవ్ లో ప్రస్తుతం చాలా మంది పిల్లలు వ్యాధి బారిన పడుతున్నారనే వాస్తవాన్ని హైలైట్ చేసింది. గత సంవత్సరం నుండి కోవిడ్ -19 ఫలితంగా మరణించిన రెండవ పాప. గతంలో వైరస్ సోకి 11 ఏళ్ల చిన్నారి మరణించాడు.
అన్ని వయసుల వారు కోవిడ్ -19 బారిన పడే ప్రమాదం ఉందని, ప్రపంచంలోని చాలా దేశాలు చిన్న పిల్లల మరణాలు నమోదు అవుతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కోవిడ్-19 కారణంగా ఖతార్లో మొత్తం మరణాల సంఖ్య 626కి పెరిగింది. దేశంలో 4,021 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 40,600కి పెరిగింది. కోవిడ్-సంబంధిత లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్లు ధరించి స్వీయ-పరిశుభ్రతను పాటించాలి అని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







