ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి..స్టెరాయిడ్స్ వద్దు..భారత ఆరోగ్య శాఖ హెచ్చరిక
- January 18, 2022
న్యూ ఢిల్లీ: కొవిడ్ ట్రీట్మెట్ లో భాగంగా కేంద్రం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. తేలికపాటి, మధ్య, తీవ్ర లక్షణాలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో వివరించింది.
ట్రీట్మెంట్ లో భాగంగా కొవిడ్-19 రోగులకు స్టెరాయిడ్స్ ఇవ్వడం ఆపేయాలని డాక్టర్లకు నీతి అయోగ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పౌల్ సూచించారు.
స్టెరాయిడ్స్ వల్ల చాలా నష్టాలున్నాయని, ఎక్కువ కాలం వాడితే బ్లాక్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని హెచ్చరించారు. రెండు లేదా మూడు వారాల కంటే ఎక్కువగా దగ్గు ఆగకుండా వస్తే టీబీ పరీక్ష తప్పక చేయించుకోవాలని చెప్పారు.
అలా కాకుండా శ్వాస తీసుకోవడంలో ఏదైనా తేలికపాటి సమస్యలు వాటిని స్వల్ప లక్షణాలుగా పరిగణించాలి. ముందస్తు జాగ్రత్తగా హోం ఐసోలేషన్ లో ఉండి ఐదు రోజులైన తగ్గకపోతే.. వైద్యుల్ని సంప్రదించాలి. పరిస్థితిని బట్టి.. ఆక్సిజన్ లెవల్ 90-93 మధ్య ఉన్న కేసులను మోడరేట్ గా భావిస్తారు. అలాంటి వారికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం అవుతుంది.
ఓ మాదిరి నుంచి తీవ్రంగా కరోనా లక్షణాలు ఉన్న వారికి రెమెడెసివిర్ డ్రగ్ ఇవ్వొచ్చు. మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేని వారికి ఈ ఔషధాన్ని ఇవ్వకూడదు. తీవ్ర వ్యాధి లక్షణాలు ఉన్నవారికి 48 గంటలలోపు టోసిలిజుమాబ్ డ్రగ్ను ఇవ్వవచ్చు.
ఆక్సిజన్ లెవల్ 90 కన్నా తక్కువగా ఉంటే సీరియస్ గా పరిగణించి.. వెంటనే ఐసీయూ సదుపాయం ఉండే గదికి మార్చాలని కొత్త గైడ్లైన్స్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









