ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి..స్టెరాయిడ్స్ వద్దు..భారత ఆరోగ్య శాఖ హెచ్చరిక
- January 18, 2022న్యూ ఢిల్లీ: కొవిడ్ ట్రీట్మెట్ లో భాగంగా కేంద్రం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. తేలికపాటి, మధ్య, తీవ్ర లక్షణాలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో వివరించింది.
ట్రీట్మెంట్ లో భాగంగా కొవిడ్-19 రోగులకు స్టెరాయిడ్స్ ఇవ్వడం ఆపేయాలని డాక్టర్లకు నీతి అయోగ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పౌల్ సూచించారు.
స్టెరాయిడ్స్ వల్ల చాలా నష్టాలున్నాయని, ఎక్కువ కాలం వాడితే బ్లాక్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని హెచ్చరించారు. రెండు లేదా మూడు వారాల కంటే ఎక్కువగా దగ్గు ఆగకుండా వస్తే టీబీ పరీక్ష తప్పక చేయించుకోవాలని చెప్పారు.
అలా కాకుండా శ్వాస తీసుకోవడంలో ఏదైనా తేలికపాటి సమస్యలు వాటిని స్వల్ప లక్షణాలుగా పరిగణించాలి. ముందస్తు జాగ్రత్తగా హోం ఐసోలేషన్ లో ఉండి ఐదు రోజులైన తగ్గకపోతే.. వైద్యుల్ని సంప్రదించాలి. పరిస్థితిని బట్టి.. ఆక్సిజన్ లెవల్ 90-93 మధ్య ఉన్న కేసులను మోడరేట్ గా భావిస్తారు. అలాంటి వారికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం అవుతుంది.
ఓ మాదిరి నుంచి తీవ్రంగా కరోనా లక్షణాలు ఉన్న వారికి రెమెడెసివిర్ డ్రగ్ ఇవ్వొచ్చు. మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేని వారికి ఈ ఔషధాన్ని ఇవ్వకూడదు. తీవ్ర వ్యాధి లక్షణాలు ఉన్నవారికి 48 గంటలలోపు టోసిలిజుమాబ్ డ్రగ్ను ఇవ్వవచ్చు.
ఆక్సిజన్ లెవల్ 90 కన్నా తక్కువగా ఉంటే సీరియస్ గా పరిగణించి.. వెంటనే ఐసీయూ సదుపాయం ఉండే గదికి మార్చాలని కొత్త గైడ్లైన్స్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ