పార్శిల్ ద్వారా బీజింగ్కు ఒమిక్రాన్...
- January 18, 2022
షాంఘై: కరోనాకు పుట్టినిల్లైన చైనా జీరో వైరస్ ను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. సార్స్కోవ్ డీ వైరస్ వూహాన్లో పుట్టలేదని, ఇటలీ నుంచి వచ్చిందని కొన్నాళ్లు మభ్యపెట్టే ప్రయత్నం చేసింది.అప్పటికే ప్రపంచానికి విషయం తెలిసిపోవడంతో కామ్గా ఉండిపోయింది.చైనాలో వ్యాక్సినేషన్తో పాటు కఠిన నిబంధనలను అమలు చేస్తూ కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.తాజాగా మరో దేశంపై చైనా అభాండాలు వేసింది.బీజింగ్లో ఇటీవలే ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి.దీంతో చైనా అప్రమత్తం అయింది.బీజింగ్కు వచ్చిన ఓ పార్శిల్ ద్వారా ఒమిక్రాన్ ఎంటర్ అయిందని, కెనడా దేశం నుంచి ఆ పార్శిల్ వచ్చినట్టు బీజింగ్ అధికారులు చెబుతున్నారు.దీంతో బీజింగ్ అధికారులు అప్రమత్తం అయ్యారు.ఫిబ్రవరి 4 నుంచి వింటర్ ఒలింపిక్స్ జరగనున్ననేపథ్యంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.బీజింగ్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







