1400 మందికి పైగా ఖాకీలకు కరోనా

- January 18, 2022 , by Maagulf
1400 మందికి పైగా ఖాకీలకు కరోనా

హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు.తెలంగాణలో క్రమేపీ కరోనా ఉగ్రరూపం దాల్చడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.తాజాగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులను కరోనా కలవరపెడుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు1,400 మంది పోలీసులకు కరోనా రావడంతో డిపార్ట్​మెంట్ అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌లో పోలీసుల్లో పాజిటివ్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 500 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డారు. అలాగే సైబరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 150 మంది పోలీసులు, రాచకొండ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 110 మందికి వైరస్ సోకినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు సీరియస్ క్రైమ్స్​విషయంలో తప్ప బాధితులు కంప్లయింట్ చేసేందుకు పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావొద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దానికి బదులుగా ఆన్​లైన్​లో కంప్లయింట్ చేయాలంటున్నారు.కొన్ని పీఎస్​ల పరిధిలో కంప్లయింట్స్​ ఫైల్​ చేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా తగ్గేవరకూ తమ సూచనలు పాటించాలంటున్నారు పోలీసు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com