భారత్లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు
- January 19, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.రోజు వారీ కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 18,69,642 టెస్టులు చేయగా… 2,82, 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.మంగళవారం నాటితో పోలిస్తే 44,889 ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 441 మంది మరణించగా… 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉండగా… పాజిటివిటీ రేటు 15.13 శాతంగా ఉంది.
ఇప్పటివరకు భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,01,241కి చేరింది. అటు కరోనా మరణాల సంఖ్య 4,87,202కి పెరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 158,88,47,554 వ్యాక్సిన్ డోసులను అధికారులు పంపిణీ చేశారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరింది. మంగళవారం నాటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసులు 0.79 శాతం పెరిగాయి.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









