భారత్లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు
- January 19, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.రోజు వారీ కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 18,69,642 టెస్టులు చేయగా… 2,82, 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.మంగళవారం నాటితో పోలిస్తే 44,889 ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 441 మంది మరణించగా… 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉండగా… పాజిటివిటీ రేటు 15.13 శాతంగా ఉంది.
ఇప్పటివరకు భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,01,241కి చేరింది. అటు కరోనా మరణాల సంఖ్య 4,87,202కి పెరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 158,88,47,554 వ్యాక్సిన్ డోసులను అధికారులు పంపిణీ చేశారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరింది. మంగళవారం నాటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసులు 0.79 శాతం పెరిగాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి