అపరిచితుడితో గేమ్ ఆడిందని భార్యపై కేసుపెట్టిన భర్త
- January 20, 2022బహ్రెయిన్: తన భార్య ప్రవర్తన బాగాలేదని, ఇద్దరు కుమార్తెల బాధ్యతను తనకు అప్పగించాలని షరియా కోర్టులో ఓ భర్త వేసిన దావాను కోర్టు తిరస్కరించింది. తన భార్య ఓ పరాయి వ్యక్తిని బెడ్ రూమ్ లోకి తీసుకొచ్చి ప్లేష్టేషన్ లో గేమ్ ఆడిందని సదరు భర్త ఆరోపించాడు. అయితే, సదరు వ్యక్తి ఆరోపణల్లో నిజాయితీ లేదని, సమర్పించిన సాక్ష్యాల్లో వాస్తవాలు కన్పించడం లేదని షరియాకోర్టు అభిప్రాయపడింది. కోర్టు ఫైల్ల ప్రకారం.. భార్య న్యాయవాది ఖోలౌద్ మజ్లూమ్ వాదనలు విన్పిస్తూ.. తన క్లయింట్ 2013లో వాదిని వివాహం చేసుకున్నారని, అతని నుండి ఇద్దరు కుమార్తెలకు (3 మరియు 5 సంవత్సరాల వయస్సు) జన్మనిచ్చారని, వారు 2020లో జారీ చేసిన తీర్పు ప్రకారం ఆమె కస్టడీలో ఉన్నారని చెప్పారు. భార్యపై అనుమానంతో ఆమెను గాయపరిచాడని, ఆమె గౌరవానికి ఇబ్బంది కల్గించాడని, అందరి ముందు ఆమె పరువు తీసే లక్ష్యంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని కోర్టులో బలంగా వాదించాడు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం