భారతీయుల మృతదేహాలు పంజాబ్కు తరలింపు
- January 21, 2022
యూఏఈ: అబుధాబిలో హౌతీ మిలిటెంట్ల దాడిలో మరణించిన ఇద్దరు భారతీయుల మృతదేహాలను శుక్రవారం పంజాబ్లోని అమృత్సర్ నగరానికి తరలించనున్నట్లు యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రకటించారు. జనవరి 17 జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు రాయబార కార్యాలయం అన్ని లాంఛనాలను పూర్తి చేసిందన్నారు. అలాగే దాడిలో మరణించిన పాకిస్తానీ జాతీయుడి మృతదేహాన్ని గురువారం ఉదయం స్వదేశానికి తరలించినట్లు పాకిస్తాన్ మిషన్లోని ఒక అధికారి తెలిపారు. సోమవారం క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించిన యెమెన్ తిరుగుబాటుదారులు చేసిన దాడిలో ముగ్గురు వ్యక్తులు - ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్థానీ మరణించారు. కాగా మరో ఆరుగురు గాయపడ్డ విషయం తెలిసిందే. ముసఫాలోని మూడు అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ట్యాంకర్లు ఈ దాడిలో దెబ్బతిన్నాయి. మరో దాడిలో అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి, అరబ్ లీగ్ వంటి ప్రపంచ సంస్థలు పౌర కేంద్రాలపై దాడిని తీవ్రంగా ఖండించాయి.ఈ సంఘటన తర్వాత, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, సోమవారం నాటి డ్రోన్ దాడిలో భారతీయుల ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం తెలుపుతూ తన యూఏఈ కౌంటర్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!