దుబాయ్ లో తొలి ఎడారి అంబులెన్స్ ప్రారంభం
- January 25, 2022
యూఏఈ: దుబాయ్లో మొట్టమొదటిసారిగా ఎడారి అంబులెన్స్ ను ప్రారంభించారు. అరబ్ హెల్త్ 2022లో భాగంగా కొత్త 4X4 ఎడారి అంబులెన్స్ ను అందుబాటులోకి తెచ్చారు. గల్ఫ్లో ఉన్న విశాలమైన ఎడారిలో ఎక్కువగా గేమ్స్ జరుగుతుంటాయి. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో సురక్షితంగా, వేగంగా రోగిని సమీప హాస్పిటల్ కు చేరవేసేందుకు అంబులెన్స్ డ్రైవర్ కు ప్రత్యేకంగా ట్రైనింగ్ అందజేశారు. ఎడారి, పర్వతాలకు సులువుగా వెళ్లేందుకు ఈ అంబులెన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇందులో ఒకేసారి ఏడుగురు రోగులను తీసుకెళ్లవచ్చు. రోగి పరిస్థితిని ముందుగానే హాస్పిటల్ కు తెలియజేయడానికి వైఫై, లైవ్ కెమెరాను కూడా అమర్చారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







