భారత్లో కరోనా కేసుల వివరాలు
- January 25, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 50,190 కేసులు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల వ్యవధిలో 614 మంది కరోనాతో మృతి చెందారు. 2,67,753 మంది కొలుకొని డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. ఇక దేశంలో ప్రస్తుతం 22,36,842 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 15.52శాతంగా ఉన్నది. కరోనా కేసులు పెరుగుతున్నా గతంలో మాదిరిగా పెద్దగా తీవ్రత కనిపించడంలేదు. పైగా ఇప్పటికే దేశంలో కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకోవడంతో వైరస్ తీవ్రతకు బ్రేకులు పడుతున్నాయి. మరోవైపు ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో కరోనా నుంచి బయటపడటం ఈజీ అయిందని చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి పట్ల చాలా కాలంగా ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి