షార్జా పాలకుడికి శుభాకాంక్షలు తెలిపిన దుబాయ్ రూలర్

- January 25, 2022 , by Maagulf
షార్జా పాలకుడికి శుభాకాంక్షలు తెలిపిన దుబాయ్ రూలర్

దుబాయ్: సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి షార్జా ఎమిరేట్ సింహాసనాన్ని అధిష్టించి 50వ వార్షికోత్సవం సందర్భంగా దుబాయ్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి జనవరి 25తో  షార్జా ఎమిరేట్ సింహాసనాన్ని అధిష్టించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. గల్ఫ్ యూనియన్ మూలస్థంభాలలో అతడు ఒకడు. తన నాయకత్వంలో షార్జా సైన్స్, సంస్కృతి పరంగా ఎంతో అభివృద్ధి చెందింది.’’ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com