ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ప్రయాణీకుల రుసుము: ఖతార్ ఎయిర్పోర్ట్స్
- January 26, 2022
దోహా: ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటీవల సర్క్యులర్ (2)ని విడుదల చేసింది. ఎయిర్ పోర్టుల్లో కొత్త సర్వీసు రుసుము ప్రవేశ పెట్టడానికి సంబంధించిన అమెండ్మెంట్ ఇది. ఈ మేరకు అందరు ఎయిర్ లైన్ మేనేజర్లకు, ట్రావెల్ ఏజెంట్లకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ మార్పు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ప్రయాణీకుల రుసుముని రివ్యూ చేసి, కొత్తగా ప్రయాణీకుల రుసుముని తెరపైకి తెచ్చింది. ఎయిర్ ఫ్రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుసుము అలాగే సెక్యూరిటీ రుసుముని అదనంగా కలిపారు. ఒక వ్యక్తికి 24 గంటల వరకు60 క్యుఎఆర్ వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని ఎయిర్ పోర్ట్ అభివృద్ధి రుసుముగా పేర్కొన్నారు. ప్రయాణీకుల భద్రతకు సంబంధించి 10 క్యుఎఆర్ వసూలు చేస్తారు. రెండేళ్ళ లోపు చిన్నారులకు ఈ ఫీజు నుంచి వెసులుబాటు వుంటుంది. ఇన్ కమింగ్ అలాగే ఇన్ ట్రాన్సిట్ కార్గో షిప్మెంట్ల కోసం 10 క్యుఎఆర్ (మెట్రిక్ టన్నుకి) వసూలు చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి