కిడ్నాప్ కేసులో ముగ్గురు ఆసియా జాతీయులకు జైలు శిక్ష
- January 27, 2022బహ్రెయిన్: కిడ్నాప్ కేసులో ముగ్గురు ఆసియా జాతీయులకు జైలు శిక్ష విధించారు. ఓ వ్యక్తిని (ఆసియా జాతీయుడు) నిందితులు ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో కిడ్నాప్ చేశారు. సుమారు 700 బహ్రెయినీ దినార్ల సొమ్ము విషయమై తలెత్తిన వివాదంతో ఈ కిడ్నాప్ జరిగింది. బాధిత వ్యక్తిని తాము వున్న చోటుకు రమ్మని నిందితులు రమ్మని కోరగా, అందుకు బాధితుడు నిరాకరించాడు. దాంతో, అతన్ని బెదిరించి కారులో కూర్చోబెట్టి, దారుణంగా కొట్టారు. రెండు రోజులపాటు బాధితుడిపై నిందితులు దాడి చేశారు. రెండు రోజుల తర్వాత బాధితుడు వారి బారి నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో పోలీసులు అతన్ని రక్షించారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తన వద్ద డబ్బు తీసుకుని, తిరిగి చెల్లించని కారణంగానే అతన్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని విచారణలో ప్రధాన నిందితుడు అంగీకరించాడు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..