కిడ్నాప్ కేసులో ముగ్గురు ఆసియా జాతీయులకు జైలు శిక్ష

- January 27, 2022 , by Maagulf
కిడ్నాప్ కేసులో ముగ్గురు ఆసియా జాతీయులకు జైలు శిక్ష

బహ్రెయిన్: కిడ్నాప్ కేసులో ముగ్గురు ఆసియా జాతీయులకు జైలు శిక్ష విధించారు. ఓ వ్యక్తిని (ఆసియా జాతీయుడు) నిందితులు ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో కిడ్నాప్ చేశారు. సుమారు 700 బహ్రెయినీ దినార్ల సొమ్ము విషయమై తలెత్తిన వివాదంతో ఈ కిడ్నాప్ జరిగింది. బాధిత వ్యక్తిని తాము వున్న చోటుకు రమ్మని నిందితులు రమ్మని కోరగా, అందుకు బాధితుడు నిరాకరించాడు. దాంతో, అతన్ని బెదిరించి కారులో కూర్చోబెట్టి, దారుణంగా కొట్టారు. రెండు రోజులపాటు బాధితుడిపై నిందితులు దాడి చేశారు. రెండు రోజుల తర్వాత బాధితుడు వారి బారి నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో పోలీసులు అతన్ని రక్షించారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తన వద్ద డబ్బు తీసుకుని, తిరిగి చెల్లించని కారణంగానే అతన్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని విచారణలో ప్రధాన నిందితుడు అంగీకరించాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com