కిడ్నాప్ కేసులో ముగ్గురు ఆసియా జాతీయులకు జైలు శిక్ష
- January 27, 2022బహ్రెయిన్: కిడ్నాప్ కేసులో ముగ్గురు ఆసియా జాతీయులకు జైలు శిక్ష విధించారు. ఓ వ్యక్తిని (ఆసియా జాతీయుడు) నిందితులు ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో కిడ్నాప్ చేశారు. సుమారు 700 బహ్రెయినీ దినార్ల సొమ్ము విషయమై తలెత్తిన వివాదంతో ఈ కిడ్నాప్ జరిగింది. బాధిత వ్యక్తిని తాము వున్న చోటుకు రమ్మని నిందితులు రమ్మని కోరగా, అందుకు బాధితుడు నిరాకరించాడు. దాంతో, అతన్ని బెదిరించి కారులో కూర్చోబెట్టి, దారుణంగా కొట్టారు. రెండు రోజులపాటు బాధితుడిపై నిందితులు దాడి చేశారు. రెండు రోజుల తర్వాత బాధితుడు వారి బారి నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో పోలీసులు అతన్ని రక్షించారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తన వద్ద డబ్బు తీసుకుని, తిరిగి చెల్లించని కారణంగానే అతన్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని విచారణలో ప్రధాన నిందితుడు అంగీకరించాడు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు