కిడ్నాప్ కేసులో ముగ్గురు ఆసియా జాతీయులకు జైలు శిక్ష
- January 27, 2022
బహ్రెయిన్: కిడ్నాప్ కేసులో ముగ్గురు ఆసియా జాతీయులకు జైలు శిక్ష విధించారు. ఓ వ్యక్తిని (ఆసియా జాతీయుడు) నిందితులు ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో కిడ్నాప్ చేశారు. సుమారు 700 బహ్రెయినీ దినార్ల సొమ్ము విషయమై తలెత్తిన వివాదంతో ఈ కిడ్నాప్ జరిగింది. బాధిత వ్యక్తిని తాము వున్న చోటుకు రమ్మని నిందితులు రమ్మని కోరగా, అందుకు బాధితుడు నిరాకరించాడు. దాంతో, అతన్ని బెదిరించి కారులో కూర్చోబెట్టి, దారుణంగా కొట్టారు. రెండు రోజులపాటు బాధితుడిపై నిందితులు దాడి చేశారు. రెండు రోజుల తర్వాత బాధితుడు వారి బారి నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో పోలీసులు అతన్ని రక్షించారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తన వద్ద డబ్బు తీసుకుని, తిరిగి చెల్లించని కారణంగానే అతన్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని విచారణలో ప్రధాన నిందితుడు అంగీకరించాడు.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









