భారత్ కరోనా అప్డేట్
- January 28, 2022న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా దేశంలో 2,51,209 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 627 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య నిన్నటి కంటే స్వల్పంగా పెరిగింది. అయితే,కోలుకున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 24 గంటల వ్యవధిలో 3,47,443 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దేశలో ప్రస్తుతం 21,05,611 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 15.88శాతంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 164,44,73,216 వ్యాక్సిన్ డోసులు అందించారు. మూడో వేవ్ కారణంగా ప్రికాషనరీ డోస్ను అందిస్తున్నారు. కరోనా మహమ్మారికి అందిస్తున్న కోవీషీల్డ్, కోవాగ్జిన్లు బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులు కేంద్రం మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు