తీవ్రవాద నేరంపై 11 మందికి జీవిత ఖైదు
- March 28, 2016
యూఏఈలో ఉన్నత న్యాయస్థానం 11 మందికి జీవిత ఖైదు విధించింది. అబుదాబీలోని ఫెడరల్ కోర్ట్ మరో ఇద్దరికి 15 సంవత్సరాలు, 13 మందికి 10 ఏళ్ళు, ఆరుగురికి మూడేళ్ళు, ఇద్దరికి ఐదేళ్ళు జైలు శిక్ష విధించారు. ఏడుగురిని నిర్దోషులుగా తేల్చింది న్యాయస్థానం. 41 మందిపై నేరాభియోగాలు మోపబడ్డాయి. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న కేసులో వీరిపై కేసులు నమోదయ్యాయి. ఆగస్ట్లో వీరి అరెస్ట్ జరిగింది. దేశంలో విధ్వంసాలు సృష్టించడం, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం, నిషేధిత మారణాయుధాల్ని వినియోగించడం తదితర అభియోగాల్ని నమోదు చేసి, నిందితుల్ని దోషులుగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







