ఫేస్బుక్ యూజర్లకు శుభవార్త...
- January 29, 2022
సోషల్మీడియా యాప్స్లో అత్యంత ప్రజాదరణను పొందిన యాప్గా ఫేస్బుక్ నిలుస్తోంది. సుమారు 3 బిలియన్ల యూజర్లు ఫేస్బుక్ సొంతం. ది వెర్జ్ ప్రకారం 2016లోనే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఫీచర్ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. మెసేంజర్లో యూజర్లు చేసే చాట్స్, కాల్స్కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ (E2EE) సెక్యూరిటీ ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది. టెక్స్ట్ సందేశాలు అలాగే గ్రూప్ చాట్లు, కాల్లను E2EE ఫీచర్ వస్తోందని ది వెర్జ్ నివేదిక తెలిపింది. అయితే 2023లోపు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ (End to end encryption) ఫీచర్ డిఫాల్ట్గా అందుబాటులో ఉండకపోవడం గమనార్హం. మెటా యాజమాన్యంలోని మరో మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ (WhatsApp).. ఇప్పటికే డిఫాల్ట్గా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్కు సపోర్ట్ చేస్తుంది.
మెసేంజర్లో ఈ ఫీచర్ పూర్తి రోల్ అవుట్తో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ చాట్లలో, యూజర్లు GIFలు, స్టిక్కర్లు, రియాక్షన్లు, మెసేజ్లకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి లేదా ఫార్వార్డ్ చేయడానికి లాంగ్ ప్రెస్ ఉపయోగించవచ్చును. అంతేకాకుండా సదరు యూజర్కు పంపిన మెసేజ్ను స్క్రీన్ షాట్ తీస్తే ఇట్టే రెసిపెంట్కు తెలిసిపోయే ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ కేవలం వానిష్ మోడ్లో మాత్రమే అందుబాటులో ఉండేది.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







