ఫేస్‌బుక్‌ యూజర్లకు శుభవార్త...

- January 29, 2022 , by Maagulf
ఫేస్‌బుక్‌ యూజర్లకు శుభవార్త...

సోషల్‌మీడియా యాప్స్‌లో అత్యంత ప్రజాదరణను పొందిన యాప్‌గా ఫేస్‌బుక్‌ నిలుస్తోంది. సుమారు 3 బిలియన్ల యూజర్లు ఫేస్‌బుక్‌ సొంతం. ది వెర్జ్ ప్రకారం 2016లోనే ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ ఫీచర్‌ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండేది.  మెసేంజర్‌లో యూజర్లు చేసే చాట్స్‌, కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ (E2EE) సెక్యూరిటీ ఫీచర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది.  టెక్స్ట్ సందేశాలు అలాగే గ్రూప్ చాట్‌లు, కాల్‌లను E2EE ఫీచర్‌ వస్తోందని ది వెర్జ్‌ నివేదిక తెలిపింది. అయితే 2023లోపు  ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End to end encryption) ఫీచర్‌ డిఫాల్ట్‌గా అందుబాటులో ఉండకపోవడం గమనార్హం. మెటా యాజమాన్యంలోని మరో మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (WhatsApp).. ఇప్పటికే డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు సపోర్ట్ చేస్తుంది. 

మెసేంజర్‌లో ఈ  ఫీచర్‌ పూర్తి రోల్ అవుట్‌తో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లలో,  యూజర్లు GIFలు, స్టిక్కర్‌లు, రియాక్షన్‌లు, మెసేజ్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి లేదా ఫార్వార్డ్ చేయడానికి లాంగ్ ప్రెస్‌ ఉపయోగించవచ్చును. అంతేకాకుండా సదరు యూజర్‌కు పంపిన మెసేజ్‌ను స్క్రీన్‌ షాట్‌ తీస్తే ఇట్టే రెసిపెంట్‌కు తెలిసిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌​ కేవలం వానిష్‌ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com