బీజింగ్ వింటర్ ఒలింపిక్స్-2022 ప్రారంభ వేడుకలకు క్రౌన్ ప్రిన్స్
- January 29, 2022
రియాద్: క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఫిబ్రవరి 4న బీజింగ్లో జరిగే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు రియాద్లోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ పర్యటన గ్లోబల్ ఒలింపిక్ ఫీల్డ్ అభివృద్ధికి, చైనా-సౌదీ సమగ్ర వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఒక వారంలో ప్రారంభమవ్వనున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆటలను బయో బబుల్ లో నిర్వహించనున్నారు. దీంతో సమ్మర్, వింటర్ గేమ్స్ రెండింటికీ ఆతిథ్యమిచ్చే మొదటి నగరంగా బీజింగ్ నిల్వనుంది. బర్డ్స్ నెస్ట్ స్టేడియంలో జరిగే ప్రారంభ వేడుకను ప్రఖ్యాత చైనీస్ డైరెక్టర్ జాంగ్ యిమౌ పర్యవేక్షించనున్నారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







