200 దిర్హామ్లు దొంగిలించిన మెకానిక్కు జైలు శిక్ష
- January 31, 2022
దుబాయ్: తన సహోద్యోగి పర్సులోంచి 200 దిర్హామ్లు దొంగిలించిన మెకానిక్ కు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ మూడు నెలల జైలు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత సెప్టెంబరులో ఈ ఘటన జరిగింది. పని చేసే ప్రాంతంలో గత నాలుగు నెలలుగా తన పర్సులోంచి పైసలు మాయం అవ్వడం బాధితుడు గమనించాడు. ఈ క్రమంలో రహస్య సీసీ కెమెరా అమర్చాడు. ఈ క్రమంలో మరోసారి తన పర్సు నుండి 200 దిర్హామ్లు మాయం అవ్వడం గమనించాడు. వెంటనే తన ఫోన్లోని నిఘా కెమెరాను చెక్ చేయగా.. షాక్ తిన్నాడు. ఓ మెకానిక్ తన వాలెట్ను తెరిచి డబ్బులు తీసుకొని తిరిగి యథాతథంగా పెట్టడం గమనించాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు తొలుత నేరాన్ని అంగీకరించలేదు. కానీ సీసీ ఫుటేజీ చూపెట్టిన తర్వాత తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







