తెలంగాణలో పెరుగుతున్న చలి
- February 06, 2022
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తూర్పు ఈశాన్య దిశల నుంచి రాష్ట్రంలోకి శీతల గాలులు వీస్తున్నాయని….వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో రాత్రి ఉష్ణో గ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశంఉన్నట్లు తెలిపారు.రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో నిన్న అత్యల్పంగా ఆదిలాబాద్లో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. మెదక్లో 11.5 డిగ్రీలు, రామగుండంలో 11.6 డిగ్రీలు, హన్మకొండలో 12.5 డిగ్రీలు, దుండిగల్లో 13.6 డిగ్రీలు, హైదరాబాద్లో 13 డిగ్రీలు, నిజామాబాద్లో 13.7 డిగ్రీలు, హకీంపేట్లో 14.7 డిగ్రీలు, భద్రాచలంలో 15.2 డిగ్రీలు, ఖమ్మంలో 15.4 డిగ్రీలు, నల్లగొండలో 16 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







