లతా మంగేష్కర్‌ అంత్యక్రియలు పూర్తి..

- February 06, 2022 , by Maagulf
లతా మంగేష్కర్‌ అంత్యక్రియలు పూర్తి..

ముంబై: దిగ్గజ గాయని లతామంగేష్కర్‌ అంత్యక్రియలు.. ముంబైలోని శివాజీ పార్క్‌లో అశృనయనాల మధ్య జరిగాయి. ఏడు దశాబ్ధాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన లతా మంగేష్కర్‌కు.. ప్రముఖులు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు.ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే సహా ఎంపీలు, మంత్రులు, అధికారులు.. గాన కోకిల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. క్వీన్‌ ఆఫ్‌ మెలోడీకి కన్నీటితో తుడి వీడ్కోలు పలికారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com