లతా మంగేష్కర్కు రాజ్యసభ నివాళి
- February 07, 2022
న్యూఢిల్లీ: గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల రాజ్యసభ ఇవాళ ఘన నివాళి అర్పించింది. క్వశ్చన్ అవర్ను రద్దు చేశారు. సభను గంట సేపు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు తెలిపారు. లతాజీ మృతి పట్ల వెంకయ్య తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశంలో భిన్నత్వం తరహాలో ఆమె స్వరంలో ఆ శక్తి ఉందని ఆయన అన్నారు.
సుమారు 25వేల పాటలకు పైగా ఆమె రికార్డ్ చేశారని, ఏడు దశాబ్ధాల పాటు దేశంలో ప్రతి ఒక్కరి భావోద్వేగాన్ని ఆమె తన గళంలో వినిపించినట్లు వెంకయ్య అన్నారు. 1999 నుంచి 2005 వరకు ఆమె రాజ్యసభలో సభ్యురాలిగా ఉన్నట్లు తెలిపారు. ఓ లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ను ఈ దేశం కోల్పోయినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!







