భారత్ కరోనా అప్డేట్

- February 09, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయినట్లే కనిపిస్తోంది. ఫిబ్రవరి తొలివారంలో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 67, 597 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం 71,365 కేసులు వెలుగుచూశాయి. అంటే నిన్నటితో పోలిస్తే 4వేల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976కి పెరిగింది.

మరోవైపు మృతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 1,217 మంది మరణించారు. మంగళవారం మరణాల సంఖ్య 1,188గా నమోదు కాగా ఈరోజు కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 5,05,279కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 8,92,828గా నమోదైంది. అటు దేశంలో డైలీ కరోనా పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com