దుబాయ్ లో ట్రాక్లెస్ ట్రామ్ సిస్టమ్.. అధ్యయనానికి ఒప్పందం
- February 10, 2022
దుబాయ్: దుబాయ్ ట్రామ్ కోసం టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి చైనాకు చెందిన సీఆర్ఆర్సీ(CRRC) ఝుజౌతో ఒప్పందంపై దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రైల్ ఏజెన్సీ, RTA CEO అబ్దుల్ మొహసేన్ ఇబ్రహీం యూన్స్, CRRC ఝుజౌ CEO యాంగ్ జిగువో ఒప్పందంపై సంతకాలు చేశారు. దుబాయ్లో ట్రాక్లెస్ ట్రామ్ సిస్టమ్ను రూపొందించే సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి చైనీస్ CRRC ఝుజౌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ఇబ్రహీం యూన్స్ తెలిపారు. ట్రాక్లెస్ ట్రామ్ సిస్టమ్ అనేది ఆధునిక సౌకర్యవంతమైన వ్యవస్థ అని, ఇది ప్రజా రవాణా ఖర్చు, ఇంధనం ఆదా చేస్తుందన్నారు. ఈ సందర్భంగా జిగువో మాట్లాడుతూ.. వినూత్నమైన, స్మార్ట్, గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ సొల్యూషన్స్ దుబాయ్కి అందించడానికి ఎదురుచూస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







