దుబాయ్ లో ట్రాక్లెస్ ట్రామ్ సిస్టమ్.. అధ్యయనానికి ఒప్పందం
- February 10, 2022
దుబాయ్: దుబాయ్ ట్రామ్ కోసం టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి చైనాకు చెందిన సీఆర్ఆర్సీ(CRRC) ఝుజౌతో ఒప్పందంపై దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రైల్ ఏజెన్సీ, RTA CEO అబ్దుల్ మొహసేన్ ఇబ్రహీం యూన్స్, CRRC ఝుజౌ CEO యాంగ్ జిగువో ఒప్పందంపై సంతకాలు చేశారు. దుబాయ్లో ట్రాక్లెస్ ట్రామ్ సిస్టమ్ను రూపొందించే సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి చైనీస్ CRRC ఝుజౌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ఇబ్రహీం యూన్స్ తెలిపారు. ట్రాక్లెస్ ట్రామ్ సిస్టమ్ అనేది ఆధునిక సౌకర్యవంతమైన వ్యవస్థ అని, ఇది ప్రజా రవాణా ఖర్చు, ఇంధనం ఆదా చేస్తుందన్నారు. ఈ సందర్భంగా జిగువో మాట్లాడుతూ.. వినూత్నమైన, స్మార్ట్, గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ సొల్యూషన్స్ దుబాయ్కి అందించడానికి ఎదురుచూస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









