బహ్రెయిన్ లో 64 ఏళ్ల భారతీయ ఖైదీ విడుదల
- February 11, 2022
బహ్రెయిన్: తీవ్రమైన డయబెటిక్, అనేక ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 64 ఏళ్ల ప్రవాస భారతీయ ఖైదీ మానవతా కారణాలతో జైలు నుంచి విడుదల అయ్యారు. ఆ తర్వాత ఇండియాకు బయలుదేరాడు. షాహుల్ హమీద్ 2003లో డ్రగ్స్ ను రవాణా చేస్తున్నాడనే కారణంతో అరెస్టయ్యాడు. చట్టవిరుద్ధంగా డ్రగ్స్ కలిగి ఉన్నాడని నిర్ధారణ కావడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. గత 19 ఏళ్లుగా అతను శిక్ష అనుభవిస్తున్నాడు. జూన్ 9, 2003న, అప్పటి సౌదీ అరేబియా రెసిడెంట్ అయిన షాహుల్ తన సెలవులను ముగించుకుని చెన్నై నుండి తిరిగి వస్తున్నాడు. సౌదీలోని అతని సన్నిహితులలో ఒకరు చెన్నై నుండి ఓ పార్సిల్ తీసుకువెళ్లాలని కోరగా.. దాన్ని తనవెంట తీసుకొచ్చాడు. అతడు బహ్రెయిన్ మీదుగా సౌదీ అరేబియా వెళుతుండగా.. బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ లో అతని పార్సిల్ లో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించి అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







