అల్ తుమ్మ కూడలి తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు
- March 30, 2016
అల్ తుమ్మ కూడలి పనులు పూర్తి చేయడానికి ఇ-రింగ్ వద్ద నజ్మా రోడ్లు అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చివరి తారు పొర చేయడానికి, పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'ఆశ్ఘల్ ' ఎనిమిది దశల్లో ఒక తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనుంది.మొదటి దశ పనులు అర్ధరాత్రి తర్వాత గురువారం నాడు మొదలై శనివారం ఉదయం 5 వరకు కోనసాగుతుంది. మిగిలిన ఏడు దశల్లో ప్రతివారం గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం 5 గంటలకు ఒకో దశ పూర్తికానుంది. ఈ పనులు ఏడు వారాంతాలలో నిర్వహించనున్నారు. ఈ పనులకు చివరి దశ మే 21 నాటికి పూర్తవుతుందని అంచనా వెయ్యబడింది.ప్రతి దశలో, కూడలి యొక్క ఒక భాగం మాత్రమే మూసివేయబడతాయి మరియు చిహ్నాలు పటంలో చూపిన విధంగా ఎక్కడ మూసి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా రహదారి తెరవబడిన భాగాలను అందులో సూచిస్తుంది ఆ విధంగా బోర్డు ఏర్పాటుచేస్తారు . కూడలి చివరి దశ పనులు సమీపించేసరికి రెండు రోజులు మినహా అక్కడ పూర్తి మూసివేత అవసరం ఉంటుంది.ఆశ్ఘల్ లో, వాహనదారులు రహదారి మళ్లింపు సలహా చిహ్నాలను ఏర్పాటుచేయనున్నారు . వేగ పరిమితులు కట్టుబడి ఉండాలని భద్రత చర్యలు నిర్ధారించడానికి రహదారి చిహ్నాలను అనుసరించండని అధికారకంగా రహదారి వినియోగదారులను ఈ సందర్భంగా అభ్యర్థించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









