సౌదీలో ఫస్ట్ డిజిటల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఏర్పాటు
- February 13, 2022
సౌదీ: వాడి అల్-దవాసిర్లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టును పూర్తి డిజిటల్ కోర్టుగా మార్చినట్లు సౌదీ అరేబియా గ్రీవెన్స్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ గ్రీవెన్స్ చైర్మన్, అడ్మినిస్ట్రేటివ్ జ్యుడీషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ షేక్ డాక్టర్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్-యూసెఫ్ వెల్లడించారు. ఫిబ్రవరి 16 నుంచి డిజిటల్ కోర్టు పని ప్రారంభిస్తుందన్నారు. వాడి అల్ దవాసిర్ డిజిటల్ కోర్టు రాజ్యంలో మొదటిదని, దాంతో సౌదీ అరేబియాలో మొదటి డిజిటల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టుగా దీనికి గుర్తింపు లభించిందన్నారు. ఈ సమీకృత డిజిటల్ కోర్టు ద్వారా న్యాయపరమైన సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు గ్రీవెన్స్ బోర్డు కృషి చేస్తోందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







