సౌదీలో ఫస్ట్ డిజిటల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఏర్పాటు
- February 13, 2022
సౌదీ: వాడి అల్-దవాసిర్లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టును పూర్తి డిజిటల్ కోర్టుగా మార్చినట్లు సౌదీ అరేబియా గ్రీవెన్స్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ గ్రీవెన్స్ చైర్మన్, అడ్మినిస్ట్రేటివ్ జ్యుడీషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ షేక్ డాక్టర్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్-యూసెఫ్ వెల్లడించారు. ఫిబ్రవరి 16 నుంచి డిజిటల్ కోర్టు పని ప్రారంభిస్తుందన్నారు. వాడి అల్ దవాసిర్ డిజిటల్ కోర్టు రాజ్యంలో మొదటిదని, దాంతో సౌదీ అరేబియాలో మొదటి డిజిటల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టుగా దీనికి గుర్తింపు లభించిందన్నారు. ఈ సమీకృత డిజిటల్ కోర్టు ద్వారా న్యాయపరమైన సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు గ్రీవెన్స్ బోర్డు కృషి చేస్తోందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!









