ఏపీ కరోనా అప్డేట్
- February 16, 2022
అమరావతి: ఏపీ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా వేల సంఖ్యలో వెలుగు చూసిన కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. వేల సంఖ్యలో నమోదైన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యలో రికార్డవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం పలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తోంది. రాత్రి వేళ కర్ఫ్యూను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఇక కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 675 మందికి కరోనా సోకింది. చిత్తూరు, కృష్ణా, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,14,502 పాజిటివ్ కేసులకు గాను…22,88,989 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.14,705 మంది చనిపోయారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 10,808గా ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి







