భీమ్లా నాయ‌క్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మంత్రి కేటీఆర్

- February 19, 2022 , by Maagulf
భీమ్లా నాయ‌క్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మంత్రి కేటీఆర్

హైదరాబాద్: జనసేనాని పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హిందీలో సైతం ఈ చిత్రం విడుదల కాబోతోంది మరోవైపు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం జరగనుంది.హైదరాబాదులోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది.ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వస్తున్నారు.

ఈ వార్తతో ఇటు పవన్ అభిమానులు, అటు టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఈ చిత్రంలో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నిత్యామీనన్, సంయుక్తా మీనన్ లు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు. తమన్ సంగీతాన్ని అందించగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com