8 మంది భారత, ఈజిప్ట్ ప్రవాసులకు 10 ఏళ్ల జైలు!
- February 20, 2022
కువైట్ సిటీ: కువైట్ లో డబ్బుకు ఆశపడి తప్పుడు రిపోర్టులు తయారు చేస్తున్న 8 మంది భారత్, ఈజిప్ట్కు చెందిన ప్రవాసులకు కువైట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ జడ్జి నాజర్ సలేం అల్ హైద్ 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.కోర్టులో పేర్కొన్న సభా అల్ సలేం హెల్త్ లేబొరేటరీలో పనిచేసే భారత్,ఈజిప్ట్కు చెందిన ప్రవాస సిబ్బంది రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను తయారు చేసే సమయంలో లంచం తీసుకుని తప్పుడు నివేదికను ఇచ్చేవారు.ఆరోగ్య పరీక్షల కోసం వచ్చే ప్రవాసుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ గత కొంతకాలంగా ఈ దందా చేస్తున్నారు.ప్రవాసులకు ఉండే దీర్ఘకాలిక రోగాలను దాచి పెట్టి వారికి కావాల్సినట్టుగా రిపోర్టులు తయారు చేయడం లేబొరేటరీ సిబ్బంది చేస్తున్న నిర్వాకం.ఈ విషయమై కొందరు ప్రవాసులు కువైత్ ఆరోగ్యమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన అంతర్గత మంత్రిశాఖతో పాటు ఆరోగ్యశాఖ అధికారులు సభా అల్ సలేం హెల్త్ లేబొరేటరీలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంతకు ముందు సిద్ధం చేసి పెట్టిన ప్రవాసుల ఫేక్ హెల్త్ రిపోర్టులను పరిశీలించారు.అనంతరం ఆ రిపోర్టు తాలూకు నలుగురు వ్యక్తులను పిలిపించి మరోసారి హెపటైటిస్-బీ, సీతో పాటు హెచ్ఐవీ కోసం రక్త పరీక్షలు నిర్వహించాలని లాబొరేటరీ సిబ్బందిని ఆదేశించారు.దీంతో రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు ప్రవాసులకు హెపటైటిస్-బీ ఉన్నట్లు నిర్ధారణ కాగా,మరో ఇద్దరికి హెపటైటిస్-సీ ఉన్నట్లు తేలింది. కానీ, లాబొరేటరీ సిబ్బంది అంతకుముందు డబ్బులు తీసుకుని రెడీ చేసిన నివేదికలో ఆ నలుగురు ప్రవాసులకు ఎలాంటి అనారోగ్యం లేదని ఉంది.ఇలా గత కొంత కాలంగా సభా అల్ సలేం హెల్త్ లేబొరేటరీలో పని చేస్తున్న 8 మంది భారత, ఈజిప్ట్కు చెందిన ప్రవాస సిబ్బంది తమ వద్దకు రక్త పరీక్షల కోసం వచ్చే వలసదారుల నుంచి అందినకాడికి దోచుకుంటూ తప్పుడు నివేదికలు ఇస్తోంది.తాజాగా ఈ కేసు కువైట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్లో విచారణకు రావడంతో దోషిగా తేలిన 8 మంది సిబ్బందికి జడ్జి నాజర్ సలేం అల్ హైద్ 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







