ఆర్మీ హెలికాప్టర్ లో నెల్లూరుకు గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలింపు
- February 22, 2022
హైదరాబాద్: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నేడు హైదరాబాద్ నుండి నెల్లూరుకు కుటుంబ సభ్యులు తరలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టు నుండి గౌతమ్ భౌతికకాయాన్ని నెల్లూరులోని నివాసానికి తరలించనున్నారు. ఈ రోజు రాత్రికి అమెరికా నుండి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి రానున్నారు.

హెలికాప్టర్ లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహంతో తల్లి, భార్య వెళ్లనున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి నెల్లూరుకు బయలు దేరారు. రేపు ఉదయగిరిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించనున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మొదటగా స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు. కానీ ఉదయగిరిలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







